Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బాసిల్లె కాల్మెటె-గ్వెరిన్ (బీసీజీ) టీకా వేయించుకున్న వారు కరోనా సోకినప్పటికీ అనారోగ్యం బారిన పడట్లేదని పరిశోధకులు గుర్తించారు. ఆ టీకా వేయించుకున్న వారితో పాటు వేయించుకోని వారిపై పరిశోధనలు చేసిన అనంతరం నెదర్లాండ్స్లోని రాడ్బౌడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఫలితాలు వెల్లడించారు. టీకా వేయించుకున్న వారు తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు తమకి ఎక్కడా కనిపించలేదని తేల్చిచెప్పారు. అలాగే, కరోనా బారిన పడే ముప్పును ఆ టీకా పెంచుతున్న పరిస్థితులేవీ లేవని తెలిపారు. క్షయ బారిన పడకుండా బీసీజీ టీకా వేస్తారన్న విషయం తెలిసిందే. ఈ టీకా చాలా సురక్షితమైందని పరిశోధకులు తెలిపారు. తమ అధ్యయనంలో భాగంగా ఐదేండ్ల క్రితం బీసీజీ టీకా వేసుకున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు ఆ టీకా వేయించుకోని వారిని కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిశీలించామని వెల్లడించారు. ఆ వాలంటీర్లలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలించి ఈ ఫలితాలు చెబుతున్నట్టు వివరించారు.