Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయ కోవిడ్ వైద్యశాలను సందర్శించిన సిపిఎం బృందం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో బాధితులకు సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కనీసం 15 వేల పడకలు సిద్ధం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిపిఎం జిల్లా, నగర, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో ఒక బృందం ప్రాంతీయ కోవిడ్ వైద్యశాలను శనివారం సందర్శించింది. కరోనా బాధితులకు ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, వారికి వైద్యశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాల వివరాలను వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్రెడ్డిని ఈ బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతున్నం దున ఇందుకు అనుగుణంగా చికిత్స అందించేందుకు వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమిం చాలని కోరారు. నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ తో చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేరిన వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. నగరంలో కరోనా అనుమాని తుల నుంచి సేకరించిన నమూనాల పరీక్షా ఫలితాల ప్రకటించడంలో జాప్యాన్ని నివారిం చాలని డిమాండ్ కోరారు. అనంతరం జిజిహెచ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు.