Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలోనే అత్యంత కుబేరుడు రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద కరోనా కష్ట కాలంలోనూ రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 80.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6 లక్షల కోట్లు) నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. ఫ్రాన్స్కు చెందిన బడా పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ను వెనక్కినెట్టి ఈ స్థానం దక్కించుకున్నారు. అంబానీ ఇప్పటికే ఎలాన్ మస్క్, సెర్జె బ్రిన్, ల్యారీ పేజ్, వారెన్ బఫెట్ లాంటి దిగ్గజాలను దాటేశారు. ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 187 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బిల్గేట్స్ 121 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ 102 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆర్నాల్ట్ 80.2 బిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి తగ్గారు.