Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కళాశాల (డెహ్రాడూన్) ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు 12, 13 తేదీల్లో జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) వెల్లడించింది. జూన్ 1, 2 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసినట్లు కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 12వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఇంగ్లీష్, మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు మేథమెటిక్స్, 13వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జనరల్ నాలెడ్జ్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. అర్హత ఉన్న అభ్యర్థుల హాల్ టిక్కెట్లను స్పీడ్ పోస్టు ద్వారా సెప్టెంబరు 5వ తేదీలోపు పంపుతామని తెలిపారు.