Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు యనమల
అమరావతి: కోవిడ్ వైరస్కు రాష్ట్రంలో గేట్లు ఎత్తేశారని, కరోనా నియంత్రణలో చేతులెత్తేశారని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. డాక్టర్లు, వైద్యసిబ్బందిని ముందస్తుగా నియామకాలు చేపట్టడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రోజుకు 90 ప్రాణాలు పోతుంటే నిద్ర ఎలా పడుతోందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన రూ.8 వేల కోట్లు ఏం చేశారు? క్వారంటైన్ కేంద్రాల్లో ఆహారానికి ఎంత ఖర్చు చేశారు? డిశ్చార్జి నగదు రూ.2 వేలు ఎంతమందికి ఇచ్చారు? ఆర్టిపిసిఆర్, ట్రూనాట్ పరీక్షలు ఎన్ని చేశారు? పరీక్షలపై మొత్తం ఎంత ఖర్చు చేశారు? కరోనా కిట్ల కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారు? బ్లీచింగ్ కొనుగోళ్లపై ఖర్చెంత? కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దూరదృష్టి లోపించడం, సమీక్షల్లో వైఫల్యం, సరైన దిశానిర్దేశం కొరవడటం, తేలిగ్గా తీసుకోవడం, నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.