Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఏపీలో పోలీసులు శిరోముండనం చేసిన ప్రసాద్ అనే దళిత యువకుడికి భారత రాష్ట్రపతి రామనాథ్ కోవిండ్ అండగా నిలిచారు. ప్రసాద్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకుంది. శిరోముండనం ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం ప్రసాద్కు అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది. దీంతో ఏపికి చెందిన సాధారణ పరిపాలనా విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయ్యింది.
అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్బాబును కలవనున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్ అనే దళిత యుకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్స్టేషన్లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్ తాను మావోయిస్టుల్లో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరస్రాద్ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.