Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేతాజీపై పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఇండియా చరిత్రపై విస్తృత అధ్యయనం జరగాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. చరిత్రలోని సమగ్రమైన, కీలక అంశాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ''నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ'' ట్రస్ట్ సభ్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్దే రచించిన ''నేతాజీ- ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటిష్ ఆర్కైవ్స్'' పుస్తకాన్ని ఢిల్లీలోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను, వారి శౌర్య కథలు, గాథలకు పాఠ్యప్రణాళికలో చోటు కల్పించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, కులం, లింగ వివక్ష లేని, అందరికీ సమాన అవకాశాలు అందించే నవ భారత నిర్మాణ రథసారథులుగా యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.