Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా తన గ్లోబల్ పార్టనర్ 'ఐఫండ్ వుమెన్' సహకారంతో భారత్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా గ్రాంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అమెరికాలో నిర్వహించిన రెండు విజయవం తమైన కార్యక్రమాలకు కొనసాగింపుగా భారత్లోని మహిళా పారిశ్రామి కవేత్తలకు కావాల్సిన వ్యాపార పరిధి అభివద్థి, విస్తరణకు నిధులు అందిం చనున్నట్లు వీసా తెలిపింది. మహిళల యాజమాన్యంలో పని చేసే సంస్థల వ్యాపార నిర్వహణకు కావాల్సిన మార్ట్ ప్లేస్ను అందించడం, మూలధనం పెట్టుబడి, వ్యాపార కౌశల్యాలకు కావలసిన శిక్షణ, నిపుణులతో అనుసం ధానానికి కావలసిన సహకారాన్ని ఇవ్వనున్నట్లు వీసా దక్షిణ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ టి ఆర్ రామచంద్రన్ తెలిపారు. దీని ప్రయోజనాలను అందుకునేందుకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.