Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే విద్యుత్ సవరణ బిల్లుతో సబ్బిడీ పవర్ పొందే వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రం స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 లో కొత్తగా ప్రతిపాదించిన సవరణలతో తెలంగాణ ప్రభుత్వం పేద గహాలు, రైతులకు ఇచ్చే సబ్బిడిపై ప్రతికూలంగా ప్రభావితం చూపగలదా? అని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చే నిబంధనలను తొలగించే ప్రతిపాదన సవరణలో లేదని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏ తరగతి వినియోగదారులకు అయినా సబ్సిడీ ఇవ్వడం కొనసాగించవచ్చని వెల్లడించారు. విద్యుత్ రంగ స్థిరత్వాన్ని పెంచడానికి కొత్త సవరణలు దోహదపడతాయన్నారు. అలాగే, చిన్న గహ వినియోగదారులు, రైతులతో సహా వినియోగదారులందరికీ నాణ్యమైన, సహేతుకమైన రేటుకు విద్యుత్ ను పొందడంలో సహాయపడతాయని చెప్పారు. మెరుగైన అకౌంటింగ్, అధిక పారదర్శకత, సరైన లక్ష్యం కోసం డిస్కామ్లు నిర్వహించే వినియోగదారుల ఖాతాలో సబ్సిడీని ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టినట్టు తెలిపారు. విద్యుత్ రంగంలో మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా సాంకేతిక పురోగతిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిపాదనలు చేశామన్నారు. టారిఫ్ పాలసీలో పునరాలోచన కోసం అందిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు.