Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా సెలవులు తగ్గింపు
న్యూఢిల్లీ : నవంబరు 1 నుంచి కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో నూతన విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభమవుతున్న కారణంగా శీతాకాలం, వేసవికాలం, ఇతర సెలవుల్ని భారీగా తగ్గించనున్నారు. కరోనా నేపధ్యంలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల 2020-21 విద్యా సంవత్సరం కోసం నిపుణుల కమిటీ చేసిన మార్గదర్శకాలకు యూజీసీ ఆమోదం తెలిపినట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ట్వీట్ చేశారు. అక్టోబర్ 31 లోగా విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్ 1 నుంచి తొలి సెమిస్టర్ తరగతులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే చాలా విద్యా సమయాన్ని నష్టపోవడంతో వారంలో ఆరు రోజులు తరగతులు జరగాలని, వేసవి, శీతాకాలం సెలవుల్ని తగ్గించాలని కాలేజీలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. సెలువులు, విరామాలను తగ్గించడం ద్వారా ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో తుది ఫలితాలను పొందగలుగుతారని యూజీసీ తెలిపింది.
కాగా, ఏప్రిల్ విడుదల చేసిన ప్రణాళికలో సెప్టెంబరు నుంచి కాలేజీలను పున:ప్రారంభించాలని యూజీసీ భావించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభించడంతో అది కార్యరూపం దాల్చలేదు.