Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్కు రూ.2,508 కోట్లు .. ఏపీకి రూ. 2525 కోట్లు : కేంద్రం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కారు ప్రత్యేకంగా రూపొందించిన కేంద్రీకృత చర్యల్లో భాగమైన వన్ నేషన్ - వన్ రేషన్ (ఒకే దేశం...ఒకే రేషన్) వ్యవస్థకి అవసరమైన షరతలు, నియమ నిబంధనలు పూర్తి చేసిన ఐదు రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకి కేంద్ర ప్రభుత్వం అనుమతిని చ్చింది. గురువారం ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్న తాధికారులు మీడియాకి వెల్లడించారు. ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా సంకట పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయని అందులో భాగంగా... అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవటం కోసం ఐదు రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియ బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ. 9,913 కోట్ల మేరకు అప్పు ద్వారా సమీకరించుకోవటానికి అనుమతి లభించినట్టవు తుందని వివరించారు. కేంద్రం నుంచి ఈ అనుమతి పొందిన రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్నాటక, త్రిపుర ఉన్నాయన్నారు. ఒక్కో రాష్ట్రానికి దాని స్థూల జాతీయోత్పత్తిని బట్టి కేంద్రం అప్పు ద్వారా రుణ సమీకరణ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంద న్నారు. టీఎస్కు రూ. 2,508 కోట్లు ఏపీకి రూ. 2525 కోట్లు రుణ సమీకరణ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.