Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 నుంచి 12వ తరగతి వరకూ
చెన్నై: కరోనా లాక్డౌన్ సందర్భంగా మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు వెళ్లడానికి తమిళనాడు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో నివసించే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ అనుమతి లేదు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి 50 శాతం మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాఠశాలలను పాక్షికంగా తిరిగి తెరవడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే అవసరాన్ని బట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులు తమ ఉపాధ్యాయులను కలిసేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రామాణికాల ప్రకారం.. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులను రెండు బ్యాచ్లుగా విభజించాలి. మొదటి బ్యాచ్ సోమవారం, బుధవారం మరియు శుక్రవారం, రెండో బ్యాచ్ మంగళవారం, గురువారం శనివారం పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. రద్దీని నివారించడానికి ఏ రోజైనా తరగతిలో 50 శాతం మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. ఉపాధ్యాయులు కూడా రెండు బ్యాచ్లలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో రెండు రోజులూ కొనసాగవచ్చు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లెందుకు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి రాతపూర్వక అనుమతి పొందాల్సి ఉంటుంది.