Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగులు వారికి విధి నిర్వహణలో ఉన్నసమయంలో కేటాయించిన ప్రభుత్వానికి చెందిన వసతి గృహాల్లో కొనసాగకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డిఎన్.పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా ఆక్రమించుకున్న వసతి గహాల నుంచి గహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖాళీ చేయిస్తుందని, అటువంటి వ్యక్తుల నుంచి ఆక్రమణ సమయానికి సంబంధించి బకాయిలు వసూలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ 565 ప్రభుత్వ వసతి గహాల నుంచి రిటైర్డు ఉద్యోగులను ఖాళీ చేయించినట్లు కోర్టు గుర్తించింది. వారి నుంచి మంత్రిత్వశాఖ రూ.3 కోట్ల మేర రుసుం వసూలు చేసినట్టు పేర్కొంది.