Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ కూటములు రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడనున్నాయి. కాగా మరో జాతీయ పార్టీ స్థానిక పార్టీతో పొత్తు ప్రకటించింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)తో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి మంగళవారం ప్రకటించారు. బీహార్ ప్రజలకు నిరుద్యోగం, పేదరికం, వరద సమస్యల నుంచి విముక్తి కలిగించడమే కూటమి లక్ష్యమన్నారు.
''రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో పొత్తు ఖరారైంది. ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వానాతో అన్ని చర్చలు పూర్తయ్యాయి. మా కూటమి అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వానాను ప్రతిపాదించాం. బిహార్ ప్రజలు ఆశీర్వదిస్తే మా కూటమి అధికారంలోకి వస్తుంది, ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుశ్వానా ముఖ్యమంత్రి అవుతారు'' అని మాయావతి మీడియాకు తెలిపారు.