Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే సరైన విధానం : సుధా నారాయణన్
న్యూఢిల్లీ : భారతదేశంలోని రైతులకు 'పంటల మద్దతు ధర' విధానాలు మాత్రమే మేలు చేస్తాయని 'ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్' (ఐజీఐడీఆర్)లో ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్గా పనిచేస్తున్న సుధా నారాయాణన్ అన్నారు. రైతుల ఆదాయ పెంపునకు సంబంధించి విధానాలు అంతగా ఫలించవని, దీనితో పోల్చుకుంటే 'పంటల మద్దతు ధర' విధానాలే చక్కటి ఫలితాలి స్తుందని ఆమె అన్నారు. ఆంగ్ల వెబ్పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నూతన వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ''రైతు ఆదాయ మద్దతు విధానాలు కాగితాలపై చాలా బాగా కనపడతాయి. పంటల మద్దతు ధర విఫలం చెందినట్టు భావిస్తాం. కానీ ఇందులో వాస్తవం లేదు. వ్యవసాయ మార్కెట్ల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. మోడీ సర్కార్ నూతన వ్యవసాయ చట్టాల ద్వారా ఆ విషయం స్పష్టమైంది. కనీస మద్దతు ధర నుంచి కేంద్రం తప్పుకోవాలని చూస్తోంది. వ్యవసాయ చట్టాల ద్వారా బలమైన సంకేతాలు వెలువడ్డాయి.
ఉద్దేశం అదే..
కనీస మద్దతు ధర విధానాలు, మార్కెట్ యార్డులు కొనసాగిస్తామని కేంద్రం చెబుతోంది. కానీ మోడీ సర్కార్ చేసిన నూతన వ్యవసాయ చట్టాల లక్ష్యం వేరుగా ఉంది. పంట ఉత్పత్తుల సేకరణ నుంచి పక్కకు తప్పుకునే విధంగా కేంద్ర విధానాలున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థలోనూ అనేక మార్పులు తీసుకువస్తున్నారు. కొన్నాండ్లు వరకూ ఎఫ్సీఐలు ఉన్నాయంటే ఉన్నాయి...అన్నట్టు వ్యవహారం నడిపిస్తారు. మద్దతు ధర వద్ద కొనుగోళ్లు చాలా పరిమితంగా ఉంటాయి.