Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ను వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. బీహార్ ప్రజలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి వారికే ఓటు వేయాలని కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. భయం కన్నా ఆశ, విభజన కన్నా ఐక్యత, అభూత కల్పన కన్నా విజ్ఞానాన్ని, అసత్యం కన్నా వాస్తవాన్ని ఎంచుకునే వాళ్లు తమకు ఓటు వేస్తారంటూ జోబిడెన్ శనివారం వ్యాఖ్యానించారు. అలాగే న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. యోగ్యతా, ప్రగతి శీల విలువలు విజయం సాధించాయని అన్నారు. బీహార్లో అక్టోబర్ 28 నుండి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే మధ్యప్రదేశ్లో జరిగే ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు అలాంటి వారినే ఎంచుకుంటారని చిదంబరం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా, బీహార్లో కాంగ్రెస్, ప్రతిపక్షకూటమి అయిన ఆర్జెడి నేతృత్వంలోని మహాఘట్బంధన్లో భాగంగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ కూటమి శుక్రవారం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని, వివాదాస్పద రైతు చట్టాలను వెంటనే రద్దు చేస్తామని ప్రకటించింది.