Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ రెండోసారి కొనసాగనున్నారు. ఈమేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్ నియమితులయ్యారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీనీ, మరో 25 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆరుగురు సభ్యులతో తెలంగాణా టీడీపీ సమన్వయ కమిటీని నియమించారు.