Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి పోలీసులుకు బాంబే హైకోర్టు ఆదేశం
- రిపబ్లిక్ టీవీ తప్పుదోవ పట్టిస్తోంది : బార్క్
ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) స్కామ్కు సంబంధించి ఈ నెల 6న నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రిపబ్లిక్ టీవీకి చెందిన ఏఆర్జీ అవుట్ లయిర్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు సోమవారం విచారించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నోటీసులు జారీ చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీఆర్పీ స్కామ్లో అతడిని నిందితుడిగా చేర్చాలంటే ముందుగా అతనికి సమన్లు జారీ చేయాలంది. వాటిని అందుకున్నట్ట యితే అర్నాబ్ అధికారులు ముందు విచారణకు సహకరిస్తాడని ఆయన తరఫు న్యాయవాది ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం న్యాయస్థానం రికార్డు చేసింది. తదుపరి విచారణ నవంబర్ 5కు వాయిదా పడింది. కాగా ఇదివరకే రిపబ్లిక్ టీవీకి చెందిన ఏఆర్జీ అవుట్ లయర్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అలాగే, బాంబే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో రిపబ్లిక్ టీవీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. ఈ కేసును సీబీఐకీ బదిలీ చేయాలని అందులో కోరింది.
రిపబ్లిక్ టీవీ తప్పుదోవ పట్టిస్తోంది : బార్క్
రిపబ్లిక్ టీవీ తప్పుదోవ పట్టిసోందని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ-బార్క్) పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న టీఆర్పీ స్కామ్ దర్యాప్తుపై తాము వ్యాఖ్యనించలేదనీ, చట్టపరంగా సదరు సంస్థకు అవసరమైన సహాయం మాత్రమే అందిస్తోందని బార్క్ తెలిపింది. ఈ మేరకూ ట్విట్టర్లో ఓ పోస్టు విడుదల చేసింది.''రిపబ్లిక్ నెట్వర్క్ చర్యలతో బార్క్ ఇండియా చాలా నిరాశకు గురైంది. ప్రయివేటు, రహస్య సమాచారాన్ని బహిర్గతవ చేయడంతో పాటు దానిని తప్పుగా చూపిస్తోంది''అని పేర్కొంది.