Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక మంత్రికి కేరళ సీఎం లేఖ
న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహార కొరతను పూడ్చడంలో భాగంగా కేంద్ర తీసుకొచ్చిన ప్రతిపాదనకు ప్రతికూల గాలులు వీస్తున్నాయి. దేశంలోని ప్రతిపక్షపార్టీల పాలిత రాష్ట్రాలు మోడీ సర్కారు సవరించిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం విధించిన రుణ పరిమితిని (రూ.1.10 ట్రిలియన్లు) తిరస్కరిస్తున్నాయి. కాగా, ఈ ప్రతిపాదనను జార్ఖండ్ ఇప్పటికే తోసిపుచ్చింది. అయితే, ఈ అంశంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. కేంద్రం 1.83 ట్రిలియన్లకు ( రూ. 1.83 లక్షల కోట్లు ) రుణం పెంచాలని విజయన్ కోరారు. '' కేంద్రం ప్రతిపాదించిన రూ.1.1 ట్రిలియన్లకు (రూ.1.10 లక్షల కోట్లు) బదులుగా.. స్పెషలల్ విండో ఫెసిలీటీ కింద రుణ పరిమితిని రూ.1.83 ట్రిలియన్లకు పెంచాలి'' అని ఆ లేఖలో విజయన్ వివరించారు. స్నేహపూర్వక వాతావరణంలో ప్రస్తుత సమస్యకు పరిష్కారం చూపే విధంగా తదుపరి మరిన్ని చర్చలు జరపాలని కేంద్ర మంత్రికి ఆయన సూచించారు. ఒకవేళ కేంద్ర విధించిన ప్రతిపాదన ప్రకారమైతే.. బకాయిపడిన మిగిలిన రూ.73వేల కోట్లను పొందడానికి రాష్ట్రాలు మరో రెండేండ్లు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇదే విషయమై మరికొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాసే అవకాశం ఉన్నది. కేంద్రం విధిం చిన రుణ పరిమితి ప్రతిపాదన ప్రస్తుత విధానంలలో ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని పుదుచ్చేరి సీఎం వి. నారాయణస్వామి అన్నారు.