Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవకతవకలపై రాసిన లేఖలు వెనక్కి
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నిర్మించబోయే నూతన పార్లమెంటు నిర్మాణానికి సంబంధించిన బిడ్ ప్రక్రియపై ఆరోపణలు వినిపించిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు వెనక్కి తగ్గింది. బిడ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ రాసిన లేఖలను వెనక్కి తీసుకున్నది. బిడ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలూ జరగలేదంటూ సంబంధిత ప్రభుత్వ విభాగం ఇచ్చిన వివరణ అనంతరం ఎస్పీ గ్రూపు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ)కి లేఖ రాసింది. ఇక మీదట రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ఇలా కొనసాగించబోమని పేర్కొన్నది. బిడ్ ప్రక్రియలో టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ (టీసీఈ), టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (టీపీఎల్)లు పాల్గొనడం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరద్ధమని ఆరోపిస్తూ సీపీడబ్ల్యూడీకి ఎస్పీ సెప్టెంబర్లో రెండు లేఖలు రాసిన విషయం విదితమే. నూతనంగా నిర్మించబోయే పార్లమెంటు భవనానికి సంబంధించిన బిడ్ను టాటా గ్రూపు దక్కించుకున్న విషయం తెలిసిందే.