Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుపిలో మూఢాచార ఘటనలు
పాట్నా : భక్తి..ఉండవచ్చు.. మూఢ భక్తి ఉండకూడదు. అలా తమ మూఢభక్తిని ప్రదర్శించుకుని నాలుకను, గొంతుకను కోసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. ఈ రెండు వేర్వేరు ఘటనలు ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..బాబేరు ప్రాంతంలోని భాటి గ్రామానికి చెందిన ఆత్మారామ్ అనే 22 ఏళ్ల యువకుడు..అక్కడి ఆలయంలో తన నాలుకను కత్తిరించుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించాడు. దీంతో తీవ్ర రక్తసావ్రమైన అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. తన కుమారుడికి మతిస్థిమితం సరిగా లేనందున ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆత్మారామ్ తండ్రి తెలిపారు. మరో ఘటనలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా కోకేశ్వర్ ..ఓ శివాలయంలో కత్తిలో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన కురారా ప్రాంతంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన రుక్మిణి మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. మూఢ నమ్మకాల వల్లే వీరిద్దరూ ఈ చర్యలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.