Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఎన్నికల నేపథ్యంలో బీహార్ ప్రజలకు కరోనా టీకాను ఉ చితంగా అందిస్తామనీ బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ తీవ్ర స్థాయిలో ర ాజకీయ దుమారం రేపుతోంది. అలాగే, ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనూ కరోనా యక్సిన్ హాట్ టాపిక్గా మారింది. ఎన్ని కలు-వ్యాక్సిన్కు ముడిపెట్టి ప్రజల జీవితాలతో బీజేపీ ఆట లాడుకుంటున్నదని ఆ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. క్రమంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ కరోనా టీకాను ఉచితంగా అందజేస్తామని ప్రకటించారని తెలిపారు. దీని కోసం ఒక్కో వ్యక్తికి రూ. 500 కేటాయిస్తున్నారని వెల్లడించారు. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అనంతరం సారంగి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.