Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీ-ప్లేన్ కొత్తదే..విమానమే పాతది..
- 50ఏండ్ల నుంచి వాడుకలో ఉన్నదే పర్యాటకానికి
- 31న ఈసర్వీసును ప్రారంభించనున్న ప్రధాని
దేశప్రజలంతా ప్రధానిగా మోడీని ఎన్నుకుంటే...ఆయన మాత్రం సొంత రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. ట్రంప్ మొదలుకుని పేరున్న విదేశీ అధ్యక్షులను గుజరాత్ కు తీసుకెళ్తారు. బుల్లెట్ ట్రైన్ మొదలుకుని విహారకోసం వినియోగించే సీ ప్లేన్ ను అక్కడే షురూ చేయటానికి రెడీ అయిపోతారు. ఇంతకీ సీప్లేన్ ప్రయాణం ఎంతవరకు సురక్షితం..?ఈ పర్యటన ప్రధాని ప్రారంభించబోతుంటే..ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.కానీ 50 ఏండ్ల నాటి నుంచి వాడుతున్న విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు..? అందులో ప్రయాణించే ప్రాణాలకు భరోసా ఎవరిస్తారన్న దానిపైనే ఇపుడు చర్చ.
అహ్మదాబాద్ : దేశంలో కెవాడియా -అహ్మదాబాద్ మధ్య మొదటి సముద్ర-విమాన సర్వీసు నవంబర్ 1 నుంచి ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సేవను అక్టోబర్ 31 న ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సీ-ప్లేన్ సేవ దేశంలో మొదటిసారిగా షురూ కానున్నది. అయితే అందులో ఉపయోగించిన విమానం 50 సంవత్స రాలు. ఈ సముద్ర విమానం మంచి స్థితిలో ఉన్నదని సేవను నిర్వహిస్తున్న వైమానిక సంస్థ అంటున్నది. మాల్దీవ్ నుంచి కొచ్చి, ఆపై గోవా మీదుగా ఈ సముద్రవిమానం కెవాడియా (గుజరాత్) కు చేరింది. దీని సామర్థ్యం 19 మంది ప్రయాణికులు.
45 నిమిషాల్లోనే 136 కి.మీ దూరానికి చేరిక..
కెవాడియా (నర్మదా జిల్లా) నుంచి సీ-విమానం 45 నిమిషాల్లో సబర్మతి రివర్ ఫ్రంట్-అహ్మదాబాద్ మధ్య 136 కి.మీ. సముద్ర విమానం చేసేలా రూపకల్పన చేశారు. ఈ విమాన యాత్ర అహ్మదాబాద్ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి రోజు సముద్ర విమానం షెడ్యూల్ మార్గంలో ఎనిమిది ట్రిప్పులు వేసేలా ఖరారు చేశారు. ప్రతి ప్రయాణికుడి నుంచి 4,800 రూపాయలు వసూలు చేసుకునేలా అనుమతించారు. ఈ విమానంలో 14 మంది ప్రయాణికులు,ఐదుగురు సిబ్బంది ఉంటారు. ఈ విమానాన్ని నడపటానికి పైలెట్కు విదేశీ పైలెట్ ఆరునెలల పాటు శిక్షణ నిస్తాడు.
సీ-ప్లేన్ ను నడపనున్న స్పైస్ జెట్
ఈ సీ-ప్లేన్ కెనడా, టర్కీ, మాల్దీవులలో సేవలు అందిం చింది . ఇప్పుడు గుజరాత్లో సేవలు అందించనున్నది. స్పైస్ జెట్ విమానయాన సంస్థ దీన్ని నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ నంబర్ 8Q-×ూజ ఉన్న ఈ సీ-ప్లేన్ను 1971లో కెనడాకు చెందిన డి హవిలాండ్ తయారు చేశారు. కెనడాలోని ఒట్టావాకు చెందిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులకు కంపెనీ మొదటి డెలివరీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈసముద్రవిమానానికి ముగ్గురు యజమా నులు మారారు. ప్రస్తుతం, సీ-ప్లెయిన్ రిజిస్ట్రేషన్లు మాల్దీవియన్ ఎయిరైలైన్స్ వద్ద ఉన్నాయి. ఆగస్టు 8, 2016 న, మాల్దీవియన్ ఎయిర్లైన్ ఈ సముద్ర-విమానం కొనుగోలు చేసింది.
మంచి స్థితిలో ఉన్న సముద్ర విమానం: స్పైస్ జెట్
50 ఏండ్ల సీ-విమానం యొక్క భద్రతా అంశాలపై అడిగితే... స్పైస్ జెట్ ప్రతినిధి మాట్లాడుతూ సీ-విమానం అత్యంత సురక్షితమైన విమానాలలో ఒకటి. ఈ విమానం క్రమం తప్పకుండా వినియోగిస్తున్నా.. మంచి కండీషన్లోనే ఉన్నదని అంటున్నారు. ఆకాశమార్గంలో విమానప్రయాణాల కు భద్రతలేదంటే...విహారం పేరిట గుజరాత్లో నడపనున్న సముద్రవిమాన ప్రయాణం కూడా ఎంతసురక్షితమనే చర్చ నడుస్తున్నది.