Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గో కరోనా.. గోగో కరోనా.. అంటూ సంచలనం రేపిన కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధినేత రామ్దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ముంబయిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. అయితే, దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో అథవాలే తన అభిమానులతో కలిసి గో కరోనా.. గో.. అంటూ నినదించారు. ఆ నినాదం కరోనాకు వినపడిందో లేదో అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ సంచలనంగా మారాయి. ఆయనపై జోకులు వేశారు. ఇంకా అందుకు సంబంధించిన ట్రోలింగ్ రకరకాలు గా ట్రెండింగ్లో ఉంది. ఆ స్థాయిలో అథవాలే నినాదం మార్మోగుతూనే ఉంది. విశేషం ఏమిటంటే.. అథవాలే కరోనాతో ఆస్పత్రిలో చేరడానికి కొన్ని గంటల ముందు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నటి పాయల్ ఘోష్ను తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అథవాలేకు కరోనా సోకిందనే వార్తల నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొన్నది.