Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సస్పెండ్ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశాలతో ఢిల్లీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. గతవారం విశ్వవిద్యాలయానికి సంబంధించిన నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయనీ, అందుకే ఆయనపై విచారణ చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రపతిని కోరింది. అంతేకాకుండా ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. 'విశ్వవిద్యాలయ సందర్శకునిగా, నిజానిజాలను పరిగణనలోకి తీసుకొని, రికార్డులో ఉన్న వాటిని గుర్తించి వీపీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి' అని విద్యాశాఖ రాష్ట్రపతి రాంనాథ్కు లేఖ రాసింది. ఈ విచారణ ముగిసే వరకూ త్యాగి విధులకు దూరంగా ఉంటారని, వారి స్థానంలో పిసి జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర విద్యాశాఖ ఢిల్లీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్కు లేఖ రాసింది.