Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : చెదురు ముదురు సంఘటనలు మినహా బీహార్లో మొదటి దశ పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగి సింది. సాయంత్రం ఆరుగంటలకు పోలింగ్ ముగిసే సమయా నికి 53.46 శాతం ఓటింగ్ నమోదైంది. 71 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి మందకొడిగానే సాగింది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనా మొదటి రెండు గంటల్లో కేవలం 6.74 శాత ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. లఖిసరాయి ప్రాంతంలో అత్యధికంగా 49.84 శాతం, ముంగర్లో అత్యల్పంగా 35.63 ఓటింగ్ నమోదైంది. పటిష్టమైన భద్రతల మధ్య, కోవిడ్ మార్గదర్శకాలతో ఎన్నికలు జరిగాయి. మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా... బుధవారం మొదటి దశ పోలింగ్ పూర్తయ్యింది. మరో 94 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న రెండో విడత, మిగిలిన 78 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. బిజెపి నేత, వ్యవసాయ శాఖ మంత్రి ప్రేమ్కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. పార్టీ ఎన్నికల గుర్తును ప్రదర్శించే స్కార్ఫ్, మాస్క్ ధరించి ఆయన పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టారు.