Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ2లో మైనస్ 7.5 శాతం
- ఇతర దేశాలతో పోల్చితే భారత్ అత్యంత పేలవం
- అగాథంలో విత్త, రియాల్టీ రంగాలు
- వ్యవ'సాయం' దన్ను
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పతనంలోనే కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం (2020 -21) జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 7.5 శాతం పతనమయ్యిందని శుక్రవారం కేంద్ర గణంకాల శాఖ అధికారికంగా వెల్లడించింది. కాగా 2019-20 ఇదే త్రైమాసికంలో 4.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా సంక్షోభానికి తోడు మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గడిచిన జూన్ త్రైమాసికంలో ి ఏకంగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. దీంతో పోల్చితే కొంత మెరుగుపడి నప్పటికీ జీడీపీ మైనస్లో కొనసాగడం అంటే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోనే ఉందనడానికి నిదర్శనమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ త్రైమాసికంలో తయారీ రంగం మైనస్ 39శాతం పతనాన్ని చవి చూడగా క్యూ2లో 0.6శాతం పెరుగుదలను నమో దు చేసింది. వ్యవసా యం, అడవులు, మత్స్యశాఖ రంగాలు 3.4శాతం మేర వృద్థిని కనబర్చాయి. మరో వైపు వాణిజ్యం, హోటళ్లు ఏకంగా మైనస్ 15 శాతం పతనాన్ని చవి చూశాయి. రక్షణ, ఇతర రంగాలు 12 శాతం ప్రతి కూల వృద్థిని ఎదుర్కొన్నాయి. విత్త, రియల్ ఎస్టేట్, నైపుణ్య సర్వీసుల రంగాలు మైనస్ 8.1శాతం పడిపోయాయి. ప్రపంచంలోనే 24 ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత జీడీపీ అత్యంత పేలవంగా ఉంది. జులై త్రైమాసికంలో బ్రిటన్ 9.6 శాతం ప్రతికూల వృద్ధిని చవి చూడగా.. ఇదే సమ యంలో చైనా వద్ధి రేటు మాత్రం ప్లస్ 4.9 శాతంగా ఉండటం విశేషం. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అమెరికా ఏకంగా 33.1శాతం వృద్ధిని సాధించింది. జపాన్ 5.8 శాతం, ఇటలీ 4.7 శాతం, ఫ్రాన్స్ 4.3 శాతం, జర్మనీ 4శాతం చొప్పున పతనాన్ని చవి చూశాయి. వీటితో పోల్చితే భారత్ అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చడంతో పాటుగా దేశంలో తీవ్ర సంక్షోభం కొనసాగుతుందని స్పష్టమవుతోంది.
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం సరైనా ప్రణాళికలు లేకుండా లాక్డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడిన విషయం తెలిసిందే. భారత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జూన్ త్రైమాసికంలో ఏకంగా రికార్డ్ పతనాన్ని చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వద్ధిరేటు మైనస్ 9.5 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయగా.. రెండంకెల ప్రతికూల వృద్థి చోటు చేసుకోనుందని అనేక అంతర్జాతీయ, జాతీయ ఎజెన్సీలు ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్తోపాటు అమెరికా, యూరప్ తదితర ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నందున మున్ముందు వద్ధికి విఘాతం కలిగే అవకాశాలు లేకపోలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇంతక్రితం రోజు హెచ్చరించారు. దేశంలో ప్రస్తుత పండుగల సీజన్ ముగిసిన తర్వాత డిమాండ్ ఎంతమేరకు స్థిరంగా ఉంటుందన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరమున్నదన్నారు.
కీలక రంగాల కునుకు..
న్యూఢిల్లీ : వరుసగా ఎనిమిదో మాసంలోనూ కీలక రంగాల ఉత్పత్తి క్షీణించింది. ఈ ఏడాది అక్టోబర్లో మైనస్ 2.5 శాతాన్ని పతనాన్ని చవి చూసింది. ప్రధానంగా ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్ రంగాలు ప్రతికూల వృద్థిని చవి చూశాయని శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎనిమిది కీలక రంగాలు 2020 సెప్టెంబర్లో 0.1 శాతం పతనాన్ని నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో ఈ రంగాలు 13 శాతం ప్రతికూల వృద్థితో అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చాయి.
గడిచిన అక్టోబర్లో బొగ్గు 11.5 శాతం, ఎరువులు, సిమెంట్, విద్యుత్ రంగాలు వరుసగా 6.3 శాతం, 2.8 శాతం, 10.5 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేశాయి.