Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: 2008 మలేగావ్ పేలుడు కేసులో 19న విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ఏడుగురితోపాటు బిజెపి ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్ తదుపరి విచారణకు హాజరుకావాలని ప్రత్యేక కోర్టుకు ఆదేశించింది. ప్రగ్యాసింగ్ ఠాకూర్, రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు వీరి అభ్యర్ధనను అనుమతించింది. అయితే, విచారణను తిరిగి ప్రారంభించాలని కోరినందున గురువారం కోర్టు ముందు హాజరుకావాలని కోరింది. కాగా సమీర్ కులకర్ణి, అజరు రహీకర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ అనే ముగ్గురు నిందితులు మాత్రమే హాజరయ్యారు. కోవిడ్ కారణంగా తమ క్లైంట్లు హాజరుకాలేకపోయారని న్యాయవాదుల కోర్టుకు తెలిపారు. డిసెంబర్ 19న నిందితులందరినీ హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్న ఈ కేసు విచారణ శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది. దీనికి న్యాయవాదులందరూ సహకరించాలని కోర్టు కోరింది. 2008 సెప్టెంబరులో మాలేగావ్ వద్ద మోటారుసైకిల్పై అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ ప్రధాన నిందితురాలు అని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.