Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్చేస్తూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని నీలం పార్క్ వద్ద గత మూడు రోజులుగా దాదాపు 500 మంది ఆరోగ్య కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఆందోళనకు మద్దతుగా వందలాది మంది గురువారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం నుంచి నిరసనకారులను బలవంతంగా తొలగించేందుకు పోలీసులు తమ ప్రతాపం చూపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారియర్స్పై విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ఆరు వేల మందికిపైగా ఆరగ్యకార్యకర్తలను మూడు నెలల కోసం కాంట్రాక్టు పద్దతిలో నియమించింది. అయితే, రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో వారి ఒప్పందాన్ని రెండుసార్లు పునరుద్ధరించింది. అంటే మొత్తం తొమ్మిది నెలల ఒప్పందం. ఈ నెల 31తో వారి కాంట్రాక్టు ముగియనున్నది. దీంతో తొమ్మిది నెలలపాటు విధుల్లో వున్న తమను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఆరోగ్య కార్యకర్తలు ఏమంటున్నారు..?
ఆరోగ్య కార్యకర్తలను తొలగించబోమనీ, వారి సర్వీసులను కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ప్రభు రామ్ చౌదరి స్వయంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, ఆ శాఖ డైరెక్టర్ చిత్ర భర ద్వాజ్ తమను విధుల నుంచి తొ లగిస్తున్నారనీ ఆరోగ్య కార్యకర్తలు ఆరోప ిస్తు న్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో తమ ప్రా ణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశామనీ.. ఇప్పుడు విధుల నుంచి అర్ధాంతరంగా తొల గిస్తు న్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఆస్పత్రిలోని కరోనా రోగు లకు సకాలంలో చికిత్స అందించేందుకు 6,200 మంది ఆరోగ్య కార్యకర్తలను నియ మించినట్టు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ జితేంద్ర కుష్వాహా చెప్పారు. వీరిలో ఏఎన్ఎంలు, వైద్యులు సహా ఇ తర ఉద్యోగు లున్నారని తెలిపారు. ఇప్పుడు జా తీయ ఆరోగ్య మిషన్ ద్వారా 3,000 మందిని వి ధుల నుంచి తొలగించాలని నిర్ణయించారన్నారు. వారి సర్వీసులను పునరుద ్ధరించేవరకూ ఆం దోళన కొనసాగిస్తారనీ, తమ వాణిని వినిపిస్తారని హెచ్చరించారు.
ఆస్పత్రుల్లో ఈ ఉద్యోగులు అవసరమే : హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్
మధ్యప్రదేశ్లో కరోనా వ్యాప్తి తగ్గలేదని మధ్యప్రదేశ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్బి సింగ్ అన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారి సేవలను కొనసాగించాలని తెలిపారు. రాజధానితో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రతి రోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ ఎస్బి సింగ్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి సర్వీసులను కొనసాగించేలా తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని పలువురు ప్రజా సంఘాలు నాయకులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.