Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.83
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల్లో వీటి ధరలు పెరగటం ఇది 12వ సారి. పెట్రోల్ లీటరుకు 20పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.82.86కు చేరుకోగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.07కు చేరింది. నవంబరు 20 నుంచి చమురు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా డీజిల్పై మొత్తం రూపాయి 80 పైసలు, డీజిల్పై రెండురూపాయల 61 పైసలు పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లు అంతర్జాతీయ చమురు ధర, విదేశీ మారకపు రేటు ఆధారంగా రోజువారీ పెట్రోల్, డీజిల్ రేట్లను సవరిస్తున్నాయి.