Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ ఆర్డినెన్స్ల ఆమోదం
ఆర్టీఐ ప్రశ్నకు ప్రణాళిక సంఘం సమాధానం
న్యూఢిల్లీ: నిటిఆయోగ్కు చెందిన ముఖ్యమంత్రుల హైపవర్డ్ కమిటీ (హెచ్పీసీ) నివేదిక లేకుండానే వివాదాస్పద వ్యవసాయ ఆర్డినెన్సుల ఆమోదంజరిగింది. సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) ప్రశ్నకు సమాధానంగా ప్రణాళికసంఘం ఇచ్చిన సమాధానంతో ఈ విషయం వెల్లడైంది. జూన్ 2020లో పార్లమెంటులో ప్రక టించి ప్రవేశపెట్టబడిన ఈఆర్డినెన్సులు అదే ఏడాది సెప్టెంబరు లో మూడు వ్యవసాయ చట్టాలకు మార్గం సుగమం చేసిన విష యం విదితమే. ఇదిలా ఉండగా, వ్యవసాయ చట్టాలలో ఒకటై న ది ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లును కమిటీ ఆమో దించినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పం పిణీ శాఖ సహాయ మంత్రి రావ్సాహెబ్ దాదారావ్ డాన్వే పార్లమెంటులో తెలిపారు. సీఎంల హెచ్సీపీని 2019లో ఏర్పా టు చేసిన విషయం విదితమే. తుదినివేదిక, తాత్కాలిక నివేదిక, కమిటీ నిర్వహించిన అన్ని సమావేశాలతేదీలు, అన్ని సమావే శాల కాపీ, ఈసమావేశాలకు హాజరైన వ్యక్తుల జాబితాను కోరు తూ దరఖాస్తుదారు ఆర్టీఐ కింద కోరారు. అయితే, ఈ కమిటీకి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నాయకత్వం వహించారు. ఇందులో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, యూపీ ముఖ్యమంత్రులు ఉన్నారు.