Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది 1.7 కోట్ల ఉద్యోగాలు కోల్పోయిన వైనం :
సీఎంఐఈ సర్వే
న్యూఢిల్లీ : భారత్ ఉద్యోగ సంక్షో భాన్ని ఎదుర్కొంటున్నది. గతేడాది దేశంలో దాదాపు 1.7కోట్ల ఉద్యోగాలు తగ్గిపోవడమే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. సెంటర్ ఫర్ మాని టరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వేల్లో గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. కరోనాకు ముందే ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొన్న భారత్ ఉద్యోగ సంక్షోభంలో పడిపో యింది. కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితులు దీనిని మరిం త తీవ్రతరం చేశాయి. అయితే, కేంద్రం మాత్రం ఈ విషయం లో ఉపశమన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నదని ఆర్థిక నిపుణులు ఆరోపిస్తున్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. 2019 డిసెంబర్తో పోలిస్తే దేశంలో 1.7కోట్ల మంది (17 మిలియన్లు ) ఉద్యోగాల సంఖ్య తగ్గిపో యింది. గతేడాది సెప్టెంబర్ నుంచి మొత్తం ఉద్యోగుల సంఖ్య 39.8 కోట్ల నుంచి 38.9 కోట్లకు పడిపోయింది. ఇది మూడు నెలల్లో 90 లక్షల మంది ( 9 మిలియన్లు) ఉద్యోగాలు కోల్పో యిందని వెల్లడిస్తున్నది. వాస్తవానికి 2020-21 మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఉపాధి గతేడాదితో పోలిస్తే 2.8 శాతం తగ్గింది. మొదటి త్రైమాసికం లో భారీ తిరోగమనం తర్వాత రెండో త్రైమాసికంలో ఇది 2.6శాతం సంకోచం కంటే ఎక్కువ( ఇందులో పూర్తి లాక్డౌన్ కాలం ఉన్నది. )
2020 డిసెంబర్లో నిరుద్యోగ రేటు 9.1శాతం( సెప్టెంబర్లో 6.7శాతం నుంచి పెరిగింది)గా నమోదైంది. పట్టన నిరుద్యోగం నవంబర్లో 6.2శాతం నుంచి డిసెంబర్లో 9.2శాతానికి భారీగా పెరగడం గమనార్హం. ఇక శ్రామికశక్తిలో 11శాతం ఉన్న మహిళలు 52శాతం మంది ఉద్యోగాలను కోల్పోవడం ఆందోళనకరం. ఇక 40 ఏండ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్నవారిలో ఉద్యోగ నష్టాలు 2019-20తో పోలిస్తే 2.17 కోట్ల ఉద్యోగాలు (21.7 మిలియన్లు) కొట్టుకుపోతాయని అంచనా. అయితే, దేశంలో ఉద్యోగ సంక్షోభాన్ని కట్టడి చేయాల్సిన మోడీ ప్రభుత్వం అందుకు తగినట్టుగా వ్యవహరించడంలేదని ఆర్థికవేత్తలు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.