Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీలంతా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే : ఓం బిర్లా
న్యూఢిల్లీ : జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కొవిడ్ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశమవుతాయని వెల్లడించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబరులో జరిగిన విధంగానే లోక్సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతాయని ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్ హాల్లో ఉంటుందని చెప్పారు. క్వశ్చన్ అవర్ యథావిధిగా ఉం టుందన్నారు. సమావేశానికి వచ్చే ఎంపీలంతా ఆర్టీ పీసీ ఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంపీల కుటుంబ సభ్యులు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిం దేనని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 27, 28 తేదీల్లో పార్ల మెంట్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న అన్ని క్యాంటీన్లలో భోజనం ఇకపై మరింత ప్రియం కానుంది. పార్లమెంటు క్యాంటీన్లలో ఆహార పదార్థాలు గతం కన్నా ఖరీదు కాబోతున్నాయి. పార్లమెంటు సభ్యులకు, ఇతరులకు ఆహార పదార్థాలపై ఇచ్చే రాయితీని రద్దు చేశారు. ఈ భోజనంపై అందించే రాయితీని ఎత్తివేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇప్పటివరకు పార్లమెంట్ క్యాంటీన్లను ఉత్తర రైల్వే నిర్వహించగా.. ఇకపై ఐటీడీసీ నడుపుతుందని స్పీకర్ చెప్పారు.