Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టియర్గ్యాస్, జలఫిరంగులను ప్రయోగించిన పోలీసులు
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా మధ్యప్రదేశ్లో జరుగుతున్న రైతు నిరసన ర్యాలీలను అడ్డుకునేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. పోలీసు బలప్రయోగం తో నిరసనల్ని అణచివేయాలని చూస్తోంది. తాజాగా శనివారం రాజధాని భోపాల్ రైతు నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా రైతులపై లాఠీచార్జ్కు దిగటం సంచలనం రేపింది. ఢిల్లీలో రైతుఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్పార్టీ నేతృత్వం లో మాజీసీఎం కమల్నాథ్, మరికొందరు నాయకు లు 'రైతు మద్దతు' యాత్రలను చేపట్టారు. దాంట్లో భాగంగా శనివారంనాటి భోపాల్ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓపెన్టాప్ బస్సులో కమల్నాథ్, మరికొందరు నాయకులు ర్యాలీలో బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారుల్ని చెదరగొట్టడం కోసం వారిపైకి టియర్గ్యాస్, జల ఫిరంగుల్ని ప్రయోగించారు. దాంతో నిరసన ర్యాలీ జరుగుతున్న ప్రదేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైతులు శాంతియుతంగా తమ నిరసన కొనసాగిస్తున్నప్పటికీ పోలీసులు లాఠీచార్జ్కు దిగటం వివాదాస్పదమైంది. రైతు నిరసన ర్యాలీకి నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. పోలీసుల దాడిలో రైతులు, తమ కార్యకర్తలు అనేకమంది తీవ్రంగా గాయపడ్డారని మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ మీడియాకు తెలియజేశారు.