Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరప్రదశ్లోని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం తీసుకువచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్ (అక్రమ, బలవంత మత మార్పిడి చట్టం-2020)పై వివాదం చెలరేగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ చట్టం మతాంతర వివాహాలు, ముస్లింలను అణగద్రొక్కె చర్యల్లో భాగంగానే తీసుకువచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, ఈ చట్టం తీసుకువచ్చిన తర్వాత ఇంటర్పెయిత్ వివాహలు చేసుకున్న చాలా మందిపై ఈ ఆర్డినెన్స్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే, న్యాయస్థానంలో మాత్రం దాదాపు 200లకు పైగా ఇలాంటి జంటలకు అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. గతేడాది ఒక్క అక్టోబర్ నెలలోనే అలహాబాద్ హైకోర్టు 125 ఇంటర్ఫెయిత్ జంటలకు రక్షణ కల్పించింది. అదే నెలలో సింగిల్ జడ్జి బెంచ్ ఈ నిర్ణయాలను ఖండిస్తూ.. కేవలం వివాహం కోసమే మతమార్పిడీలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అయితే, ఇటీవల ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ న్యాయవాది విశాల్ థాక్రే, తీస్తసెతల్వాడ్, సిటీజెన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరింది. అలహాబాద్ హైకోర్టు విచారణలో ఎందుకు జోక్యం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించింది.