Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరికి పద్మశ్రీ
న్యూఢిల్లీ : ఆయా రంగాల్లో విశిష్ట సేవలం దించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక 'పద్మ' పుర స్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా ఈ పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికిగానూ ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. గానగంధ ర్వుడిగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యానికి పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. తన పాటలతో బాలగోపాలన్ని అలరించిన బాలసుబ్రమణ్యం గత ఏడాది ఆఖరులో కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఒకరిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఏపీ నుంచి రామస్వామి అన్నవరపు (కళలు), నిదుమోలు సుమతి (కళలు), ప్రకాశరావు అశావాది (సాహిత్యం) పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు. తెలంగాణ నుంచి కనకరాజు (కళలు) ఈజాబితాలో ఉన్నారు. బాలసుబ్ర మణ్యంతో పాటు ఇంకా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (పబ్లిక్ ఎఫైర్స్), కర్ణాటకు చెందిన బెల్లే మోనప్ప హేగ్డే (వైద్యం), నరేంద్ర సింగ్ కపనీ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ (అధ్యాత్మికం), బిబి లాల్ (పురావస్తు), సుదర్శన్ సాహో (కళలు)కు పద్మ విభూషణ్ ప్రకటించారు. పద్మభూషణ్ విజేతలు : కేరళకు చెందిన కృష్ణన్ నాయిర్ శాంతికుమారి చిత్ర (కళలు), అసోం మాజీ సిఎం తరుణ్ గోగోయి (పబ్లిక్ ఎఫైర్స్), కర్నాటకకు చెందిన చంద్రశేఖర్ కంబర (సాహిత్యం), లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ (పబ్లిక్ ఎఫైర్స్), యూపీకి చెందిన నృపేంద్ర మిశ్రా (సివిల్ సర్వీస్), బీహార్కు చెందిన మాజీ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ (పబ్లిక్ ఎఫైర్స్), యూపీకి చెందిన కల్బే సాధిక్ (అధ్యాత్మికం), మహరాష్ట్రకు చెందిన రజనీకాంత్ దేవిదాస్ ష్రాఫ్ (వాణిజ్యం), తర్లోచన్ సింగ్ (పబ్లిక్ ఎఫైర్స్).
102 మందికి పద్మశ్రీ
ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరితో సహా 102 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. తమిళనాడు నుంచి పి అనిత (క్రీడలు), సుబ్బు అరుముగం (కళలు), సోలోమాన్ పప్పయి (సాహిత్యం), పప్పమ్మాల్ (వ్యవసాయం), బాంబే జయశ్రీ రామ్నాథ్ (కళలు) పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో పద్మ అవార్డులు అందచేయనున్నారు.