Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగుచట్టాలపై ఆగ్రహించిన రైతాంగం
- నిరసనలతో చట్టాలు రద్దు కావన్న మంత్రి
- తోమర్ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం
- యూపీలో అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి
- దేశవ్యాప్తంగా 89వ రోజూ కొనసాగిన ఉద్యమం
- ఏఐకేఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు సహజానంద్కు హన్నన్ మొల్లా, ధావలే నివాళి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగు వ్యతిరేక చట్టాలపై నిరసన తెలిపే చర్యల్లో భాగంగా... హర్యానాలోని రెండు జిల్లాల రైతులు తమ పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ రాష్ట్రంలోని జింద్, బీవానీ మహేంద్రఘడ్ జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు తమ పంటను ధ్వంసం చేసి ఆందోళన తెలిపారు. తాము పండించే గోధుమ పంటకు, తాజా రైతు వ్యతిరేక చట్టాల కారణంగా సరైన గిట్టుబాటు, మద్దతు ధర రాదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ పంటను కష్టపడి పండించినప్పటికీ ధ్వంసం చేసి నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వారంతా మోడీ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ సర్కార్ ముర్థాబాద్... శరం కరో... శరం కరో అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, రైతు ఉద్యమంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనలు చట్టాలను రద్దు చేసేందుకు ప్రేరేపితం చేయలేవని వ్యాఖ్యానించి రైతుల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ఇదే విషయంపై సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏఐకేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి సహాజానంద్ జయంతి సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్నన్ మొల్లా, అశోక్ ధావలే ఢిల్లీలో నివాళి అర్పించారు.
అభ్యంతరకరం : ఎస్కేయూ
ఉద్యమాన్ని స్వయంగా వ్యవసాయ మంత్రే చిన్న బుచ్చే విధంగా ప్రకటనలు చేయడం తీవ్ర అభ్యం తకరమని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయూ) సమన్వయకర్త దర్శన్ పాల్ అన్నారు. సాగు వ్యతిరేక చట్టాలపై రైతులు ప్రజాస్వామ్యయు తంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలు సంబంధిత అంశాలను పరిష్కరించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపర్చడమేనన్నారు. తాము చేస్తున్న ఉద్యమం జాతీయంగా... అంతర్జాతీయం ఖ్యాతి గడించిన విషయాన్ని దర్శన్పాల్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రజానీకం ఓట్లు వేస్తేనే కదా ఎన్నికల్లో గెలిచింది.. ఈ విషయం మంత్రి మన నం చేసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలోని మహా పంచాయతీలు, కిసాన్ పంచాయతీలు నిర్వహిస్తూ రైత ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్న రైతాంగ నేతలకి ఎస్కేయూ అభినందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ, తమిళనాడులో రైతు చట్టాలపై జరుగుతున్న పోరాటాన్ని తాము సమర్థిస్తున్నామని చెప్పారు. అమెరికాలోని 87 రైతు సంఘాలు సైతం తమ ఉద్యమానికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని... చట్టాలు రద్దు చేసేదాకా తాము పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని ప్రకటించారు.
కేరళ ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ గాంధీ
కేరళలోని వయనాడ్లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ తన పెట్టుబడిదారీ స్నేహితులను ప్రసన్నం చేసుకునేందుకు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి... అన్నదాతలకు ఉపయోగపడేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
89వ రోజు కొనసాగిన రైతుల ఆందోళన
రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 89వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాలను పూర్తిగా రద్దు చేసేదాకా తాము ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 23న) ''పగ్డి సంభల్ దివాస్షని భారీ స్థాయిలో జరపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో భాగంగా రైతులంతా నెత్తిపైన ఆకుపచ్చ తలపాగా ధరించాలని పిలుపునిచ్చారు.