Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుదేలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ కుప్పకూలాయి. దేశంలో కరోనా కేసులు పెరగడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల వల్ల సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1145 పాయింట్లు పతనమై 49,755.32కు పడిపోయింది. దీంతో మూడు వారాల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ ఒక్క సెషన్లో మదుపర్లు ప్రతీ నిమిషానికి రూ.1000 కోట్ల మేర నష్టాన్ని చవి చూడగా.. మొత్తంగా రూ.3.72 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 306 పాయింట్లు కోల్పోయి 14,675 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల పరంపర కొనసాగడంతో.. మార్కెట్లు ఎప్పుడూ ముగుస్తాయా అని
మదుపర్లు వేచి చూశారు. నిఫ్టీలో ఒక్క లోహ సూచీ మాత్రమే 1.60 శాతం పెరగ్గా.. మిగితా రంగాలన్నీ నేల చూపులు చూశాయి. ఐటీ 2.89 శాతం, రియాల్టీ 2.80 శాతం, ఫార్మా 2.55 శాతం చొప్పున అధికంగా పతనమైన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు సెన్సెక్స్-30లో కేవలం ఓఎన్జీసీ, కొటాక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు మాత్రమే 1.14 శాతం మేర పెరగ్గా.. మిగతా 27 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.