Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి బాధితురాలి తండ్రి దారుణ హత్య
- పశువులమేతకు వెళ్లిన దళిత బాలికపై...
లక్నో: బీజేపీ పాలిత యూపీలో మహిళలపై అఘాయిత్యాలు, వారి కుటుంబాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో దారుణ ఘటన హత్రాస్లో చోటుచేసుకుంది. లైంగికదాడి వేధింపుల కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన నిందితుడు బాధితురాలి కుటుంబంపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తండ్రి పొలం దగ్గర పనులు చేసుకుంటుండగా.. నిందితుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలోనే బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. బాధితురాలు చేతులు జోడించి ''దయ చేసి నాకు న్యాయం చేయండి. మొదట నన్ను వేధింపులకు గురిచేశాడు. పోలీసులను ఆశ్రయిస్తే.. ఇప్పుడు నా తండ్రి ప్రాణాలు తీశాడు'' అంటూ ఏడుస్తూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 2018లో ఆ బాలికను వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు. రెండేండ్ల జైలుశిక్ష అనుభవించి.. .ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు.
14 ఏండ్ల బాలికపై
యూపీలోని బండా జిల్లాలో 14 ఏండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించాడు ఓ ప్రబుద్దుడు. అటవీ ప్రాంతంలో మేకలు మేపుతుండగా బాలికపై లైంగికదాడికి యత్నించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసుకుని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోచోట పశువుల మేతకు వెళ్లి శవమైన దళిత బాలిక
పశువుల మేత కోసం వెళ్లిన ఓ దళిత బాలిక పొలాల్లో శవమై కనిపించింది. అత్యంత క్రూరంగా బాలిక గొంతు నులిమి ప్రాణాలు తీశారు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని అలీగఢ్లోని అక్రాబాద్ ప్రాంతానికి చెందిన దళిత బాలిక (16) పశువుల మేత కోసం పొలానికి వెళ్లింది. బాలిక ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతగ్గా.. పొలంలో బాలిక చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా.. నిందితులను వెంటనే పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో స్థానిక ఎస్హెచ్వోతో పాటు ఇద్దరు పోలీసులు కూడా ఉన్నాయి.
ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అలీగఢ్) మునిరాజ్ మాట్లాడుతూ.. దీనిపై లైంగికడాది, హత్య (పోక్పో చట్టం) కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు తెలిపారు. పోస్టుమార్ట ప్రాథమిక రిపోర్టును ఉటంకిస్తూ.. బాలిక గొంతు నులమడంతో చనిపోయిందని తెలిపారు. మృతురాలి ప్రయివేటు భాగాల్లో ఎలాంటి గాయాలు కాలేదనీ, లైంగికదాడికి సంబంధించి రిపోర్టులు రాలేదనీ, స్వాబ్లను టెస్టుకు పంపినట్టు తెలిపారు. కాగా, ప్రాథమికంగా ఆమెపై లైంగికడాదికి యత్నించి ఉంటారనీ, ఆ తర్వాత హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నామనీ, దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.