Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనిచేసే చోట మహిళలపై తీవ్ర వివక్ష
- వేతనం, పదోన్నతుల్లో 85 శాతం మంది ఆడబిడ్డలకు మొండిచేయి
- సమాన హౌదా, అనుభవం ఉన్నా పురుషులకే ప్రాధాన్యం
- ఆసియా-పసిఫిక్ దేశాల్లో భారత్ లోనే ఈ వైఖరి ఎక్కువ : 'లింక్డ్ఇన్' సర్వే
స్రవంతి
ఆవకాయ పచ్చడి పెట్టడం నుంచి అంతరిక్షంలోకి దూసుకువెళ్లే వరకూ.. కొవ్వొత్తుల తయారీ దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకూ.. ఇలా అన్ని రంగాల్లో ఆమె ఉనికి స్పష్టంగా కనిపిస్తున్నది. మగువను ఆకాశంలో సగంగా కీర్తిస్తున్న ఈ సమాజం.. నిజానికి ఆమె మేధా సంపత్తికి, వృత్తిపట్ల ఉన్న నిబద్ధతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇస్తున్నదా? సందేహమే. సామర్థ్యం, నేర్పు, నైపుణ్యం ఉన్నప్పటికీ 'మహిళ' అనే వివక్ష కారణంగా ఎంతో మంది ఆడ బిడ్డలు వేతనం, పదోన్నతుల విషయంలో వివక్షకు గురవుతున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ 'లింక్డ్ఇన్' - అప్పార్చునిటీ ఇండెక్స్ 2021 పేరిట చేసిన సర్వేలో తేలింది. లింగ బేధం అనే కారణంగా పలు సంస్థల్లో పనిచేస్తున్న 85 శాతం మంది మహిళలు.. పదోన్నతులు, పనికి దగ్గ వేతనం అందుకోవడంలో వివక్షకు గురవుతున్నట్టు అధ్యయనం తేల్చింది.
అధ్యయనంలోని మరికొన్ని కీలక అంశాలు
- భారత్ లోని వివిధ కంపెనీలు, కార్యాలయాల్లో పనిచేసే కనీసం 60 శాతం మంది మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారు. ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఇదే అత్యధికం.
- కరోనా సంక్షోభం వల్ల పలు సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఈ తొలగింపు జాబితాలో ముందున్నది మహిళలే.
- సమాన హౌదా, అనుభవం ఉన్నప్పటికీ, సహౌద్యోగులైన పురుషుల కంటే తమకు తక్కువ వేతనం అందుతున్నట్టు 37 శాతం మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
- కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు పనిచేసే చోట అనవసరమైన నిందలు, వివక్షకు గురవుతున్నట్టు 63 శాతం మంది మహిళలు చెప్పారు. 'ఇంటి పనిపై ఉన్న శ్రద్ధ.. ఆఫీసు పనిపై లేదం'టూ ఈసడింపులు ఉండేవని వాళ్ళు తెలిపారు.
- మహిళలమనే కారణంగా వత్తిపరమైన నైపుణ్యాల శిక్షణ, కెరీర్ గైడెన్స్ ను ఇవ్వడంలో సంస్థలు తమపై వివక్ష చూపాయని 65 శాతం ఆడబిడ్డలు తెలిపారు.
- తాము చేసే పనికి యజమాని నుంచి గుర్తింపు లభించాలని 56 శాతం మంది మహిళలు కోరుకుంటున్నారు.