Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఏ ప్రభుత్వాన్నయినా ఆ దేశ పౌరుడు వ్యతిరేకించటం, ప్రభుత్వ అభిప్రాయా లకు భిన్నమైన భావాలను వ్యక్తపరచటాన్ని రాజద్రోహంగా పేర్కొనలేమని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. దీంతో ఫరూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాజద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయాలంటూ వేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని నిరసిస్తూ... తిరిగి తాము ఆ అధికారం పొందేందుకు అవసరమైతే చైనా, పాకిస్తాన్ దేశాల సహాయం తీసుకుంటామంటూ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఆరోపిం చారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైన వ్యాఖ్యలనీ, దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని రజత్ శర్మ, నేV్ా శ్రీవాస్తవలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఫారుఖ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయా లనీ, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలనీ, ఐపీసీలోని సెక్షన్ 124-ఏ కింద చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజ రు కిషన్ కౌల్, జస్టిస్ మేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ పై సుప్రీం కోర్టు ఘాటుగానే స్పందించింది. అబ్దుల్లాపై చేసిన ఆరోపణలను రుజువు చేయడంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి విఫలమైనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ సంద ర్భంగా పిటిషనర్కు రూ.50వేల జరిమానా విధించింది. ఆ మొత్తం డిపాజిట్ చేయాలని ఆదేశించింది.