Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు రాష్ట్రాల్లో కరోనా ఉధృతం
- 85 శాతం కేసులు అక్కడే..
న్యూఢిల్లీ : దేశంలో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరి స్తోంది. ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మొత్తం 17,407 కొత్త కేసులు నమోదయ్యాయి. 89 మంది మరణించారు. కొత్త కేసుల్లో 85 శాతం ఆరు రాష్ట్రాల్లోనే నమోదుకావడం గమనార్హం. ఈ ఆరు రాష్ట్రాల జాబితాలో మహరాష్ట్రతో పాటు కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక ఉన్నాయి. మహరాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఈ ఒక్క రాష్ట్రంలోనే 9,855 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇదే అత్యధికం. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గతేడాది అక్టోబర్ 18న నమోదైన రోజువారీ కేసులు(10,259) తర్వాత ఆ సంఖ్యను దాటి కొత్త కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి.