Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఈడీని పేల్చడంతో ముగ్గురు జవాన్లు మృతి
- మరో ఇద్దరి పరిస్థితి విషమం
రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ సింగ్భూమ్ అటవీ ప్రాంతంలో లాండ్మైన్ను (ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ సింగ్భూమ్లోని హొయతు గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఐఈడీ బాంబు మావోయిస్టులు పేల్చారని సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడిం చారు. ఇందులో రాష్ట్ర పోలీసు విభాగంలోని జార్ఖండ్ జాగ్వార్కు చెందిన ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారనీ, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 197వ బెటాలియన్కు చెందిన ఒక జవాన్ కూడా గాయపడ్డాడని చెప్పారు. ఈ ప్రాంతంలో మావోస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతన్న క్రమంలో ఈ ఘటన చేటుచేసుకుందని వెల్లడించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.