Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ఇసన్న పల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ మోటార్ లకు విద్యుత్ అధికారులు కెపాసిటర్ లను బిగించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడి కిరణ్ చైతన్య మాట్లాడుతూ విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ లను బిగించడం ద్వారా విద్యుత్ ఆదా అవడంతో పాటు లో ఓల్టేజ్ సమస్య తీరుతుందని, విద్యుత్ అంతరాయం లేకుండా కెపాసిటర్లు ఉపయోగపడతాయన్నారు. ప్రతి రైతు తమ వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్ లకు కెపాసిటర్ లను తప్పకుండా బిగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె రాములు, విద్యుత్ ఎఈ భూమయ్య, విద్యుత్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.