Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక : మద్యం మత్తులో ఆకతాయి చేసిన పనికి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ అమానవీయ ఘటన కర్నాటక రాష్ట్రం కొడగు జిల్లా కనూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఓ ఆకతాయి మద్యం మత్తులో ఓ ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. ఇంట్లో ఉన్న ఎనిమిదిమంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.