Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని పౌరీగర్వాల్, కమావు ప్రాంతాల్లోని కార్చిచ్చుతో వేలాది హెక్టార్లలో అడవులు దగ్ధమవుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు రాష్ట్ర అటవీ శాఖ తీవ్రంగా యత్నిస్తోంది. సుమారు 12 వేల సహాయక సిబ్బందిని మోహరించినట్టు అధికారులు తెలిపారు. కాగా, సుమారు 62హెక్టార్ల అటవీ ప్రాంతంలో సంభవించిన మంటల కారణంగా ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సుమారు రూ.37లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. మంటల నివారణకు భారత వాయుసేన హెలికాప్టర్లు అందించాలని కోరుతూ కేంద్రాన్ని కోరారు