Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020-21 ప్రాజెక్టుల వివరాలు
- కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రానికి 2020-21 సంవత్సరానికి రూ.1005.38 కోట్ల వ్యయంతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజాంపేట-బీదర్ మధ్య ఉన్న ఎన్హెచ్ 161 బీపై అదనంగా 2 లేన అప్గ్రెడేషన్ కోసం అవసరమైన భూ సేకరణకు రూ.27.79 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. 2020-21 సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి(ఓ) కింద ఎన్హెచ్-565 లోని నకరేకల్-నాగర్జునాసాగర్ మధ్య ప్రాంతంలో పునరావాసం, అప్గ్రేడ్ చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న పనులను మంజూరు చేసినట్టు గడ్కరీ ప్రకటించారు. అంతేగాక హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44లో రోడ్డు రవాణా భద్రతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సర్వీసు రోడ్లు, వాహన అండర్ పాస్ల నిర్మాణం కోసం రూ.21.16కోట్లు మంజూరు చేశామన్నారు. ఎన్హెచ్-163 లోని హైదరాబాద్-భూపాలపట్నం మధ్య రహదారిని మెరుగుపరచడంతో పాటు అవసరమైన చోట్ల ఆరు లేన్లకు విస్తరించడం, వర్షపు నీరు పోయేందుకు కాలువల నిర్మాణానికి రూ.48.32 కోట్లు మంజూరు అయ్యిందన్నారు. ఎన్హెచ్ 63 పై ఉన్న ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ మధ్య రహదారిని ఆరు లేన్లకు విస్తరించడంతో పాటు పునరావాసం కల్పించడం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, రహదారి భద్రతా సదుపాయాల తదితర అంశాల అభివృద్ధికి రూ.545.11 కోట్లు మంజూరు అయ్యాయని గడ్కరీ ట్వీట్లో వెల్లడించారు. ఎన్హెచ్ -167 లోని జడ్చర్ల్ల-కల్వకుర్తి మధ్య జడ్చర్ల్ల పట్టణంలో 4 లేన్ల ఆర్ఓబి నిర్మాణం, పునర్నిర్మాణం కోసం రూ.45.81 కోట్లు కేటాయించామని గడ్కరీ వెల్లడించారు.