Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొంతమంది కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు పాజిటివ్గా తేలింది. మార్చి 3న ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన నగరాల నుంచి పల్లెల వరకూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాగా, ప్రస్తుతం ఆయన ఉత్తర కేరళ కన్నూరులోని ఆయన నివాసంలో ఐసోలేషన్లో వున్నట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవనీ, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నాయి. ఆయన కుమార్తె వీణా విజయన్కు మంగళవారం పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో విజయన్కు కన్నూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా వైరస్ పాజిటివ్ వచ్చింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననీ, ఇటీవల తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయన్ ట్వీట్ చేశారు.