Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న వేళ.. షెడ్యూల్ ప్రకారమే 10, 12 తరగతుల పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సిబిఎస్ఇ ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సిబిఎస్ఇ చెబుతూ విద్యార్థుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయడమో లేదా రద్దు చేయడమో చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. కరోనా మహమ్మారికి తోడు పరీక్షల ఒత్తిడి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. మే 4 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని సిబిఎస్ గతేడాది డిసెంబర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని సిబిఎస్ఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గెర్రీ అరాథూన్ గురువారం ఒక సందర్భంగా స్పష్టం చేశారు.