Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టులో మాట మార్చిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశరాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్ వద్ద ప్రార్థనలకు అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మర్కజ్ వద్ద ప్రార్థనలకు అనుమతించిన ఒక రోజు వ్యవధిలోనే కేంద్రం తన నిర్ణయంపై యు టర్న్ తీసుకోవడం విశేషం. మర్కజ్ వద్ద ప్రార్థనలకు భక్తులను అనుమతించాలని సోమవారం తెలిపిన కేంద్రం, మంగళవారం మాత్రం కేవలం ఢిల్లీ వరకూ రూపొందించిన నూతన విపత్తు నిర్వహణ నియమాల ప్రకారం మర్కజ్లో ప్రార్థనలకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది. రంజాన్ మాసం సందర్భంగా మర్కజ్లో ప్రార్థనలకు అనుమతించాలని ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ వక్ఫ్ బోర్డు పిటీషన్ వేసింది. విచారణ సందర్భంగా సోమవారం 'పోలీసులు ధ్రువీకరిం చిన 200 మంది వ్యక్తుల జాబితా నుంచి ఒకేసారి 20 మందిని మర్కజ్లో ప్రార్థన లకు అనుమతించవచ్చనని' కోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీ నోటిఫికేషన్లో, మతపరమైన ప్రదేశాల్లో సమూహాలను 20 మందికి తగ్గించారు' అని తెలిపింది. ఉత్తరాఖండ్లో హరిద్వార్లో మహకుంభ్ మేళాలో కోవిడ్ నిమయాలను పాటించకుండా ప్రజలు భారీగా పాల్గొనడాన్ని ప్రశ్నించింది. ఇతర ప్రార్థనా స్థలాలకు లేనప్పుడు మసీదుకు మాత్రం సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించడం అవసరం లేదని స్పష్టం చేసింది. మంగళవారం మాట మార్చిన కేంద్రం ఢిల్లీలో అన్ని మతాల సమావేశాలను నిలిపివేసే విధంగా నూతన విపత్తు నిర్వహణ నియమాలను కోర్టుకు అందజేసింది.